: ఇంటర్నెట్ లో ఎంపీ శశికళ ఆశ్లీల ఫొటోలు

అన్నాడీఎంకే బహిష్కృత ఎంపీ శశికళ పుష్ప ఆశ్లీల ఫొటోలు, పోస్టులు ఇంటర్నెట్ లో దర్శనమిస్తున్నాయి. దీంతో, తన ఫొటోలను మార్ఫింగ్ చేసి, అభ్యంతరకరమైన పోస్టులు పెడుతూ తనను టార్గెట్ చేస్తున్నారని... తన పరువు పోగొట్టేలా వ్యవహరిస్తున్నారంటూ ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏఐఏడీఎంకేకు చెందినవారే ఈ దారుణానికి ఒడిగడుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో, ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఐటీ చట్టం  కింద కేసు నమోదు చేశామని... సైబర్ సెల్ దీనిపై దర్యాప్తు చేస్తుందని క్రైం విభాగం డీసీపీ తెలిపారు. మరోవైపు, శశికళ పుష్పను పార్టీ నుంచి జయలలిత బహిష్కరించిన సంగతి తెలిసిందే. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే కారణంతో శశికళను సస్పెండ్ చేశారు.

More Telugu News