: నేడు, రేపు శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్న జగన్

ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేడు, రేపు (శుక్రవారం, శనివారం) శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు. నేడు జిల్లాలోని పాతపట్నం నియోజకవర్గంలోని హిరమండలంలో వంశధార ప్రాజెక్టు నిర్వాసితులతో నిర్వహించనున్న ముఖాముఖిలో జగన్ పాల్గొంటారు. శనివారం ఇచ్చాపురం నియోజకవర్గంలో పర్యటిస్తారు. అందులో భాగంగా జగతి గ్రామంలో కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న వారిని జగన్ పరామర్శించనున్నారు.

More Telugu News