: ఐసిస్ అనుమానిత ఉగ్రవాదులపై కుట్ర, రాజద్రోహం కేసులు నమోదు

అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఐసిస్ కు చెందిన ముగ్గురు అనుమానితులపై కుట్ర, రాజద్రోహం కేసులు నమోదు చేసినట్టు హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు తెలిపారు. నిన్న అదుపులోకి తీసుకున్న అనుమానిత ఉగ్రవాదులు మొహియుద్దీన్, బాసిత్, ఖురేషీ లను విచారించి బైండోవర్ తో విడుదల చేశామని సీసీఎస్ డీసీపీ అవినాష్ మహంతి తెలిపారు. ఐఎస్ భావజాలంతో యువకులు మాట్లాడిన వీడియోలు ఇవ్వాలని ఓ ఛానెల్ కు నోటీసులు పంపామన్నారు.  

More Telugu News