: అమిత్ షా ఏపీ పర్యటన ఖరారు.. 25న విజయవాడకు రాక

బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఏపీ పర్యటన ఖరారైంది. ఈ నెల 25న విజయవాడలోని సిద్ధార్థ మెడికల్ కాలేజీ మైదానంలో బీజేపీ బూత్ కమిటీ కార్యకర్తల మహా సమ్మేళనం జరగనుంది. ఈ కార్యక్రమానికి అమిత్ షా హాజరుకానున్నారు. ఆయనతో పాటు కేంద్ర మంత్రులు సురేష్ ప్రభు, వెంకయ్యనాయుడులు కూడా హాజరవుతున్నారు. ఈ సందర్భంగా ఏపీ మంత్రి, బీజేపీ నేత కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్రంలో 23 వేల బూత్ లకు కమిటీలను వేశామని తెలిపారు. 25న జరగనున్న మహా సమ్మేళనానికి 13 జిల్లాల నుంచి ప్రతి బూత్ కు ముగ్గురు చొప్పున హాజరవుతారని చెప్పారు. 

More Telugu News