: మేడమ్! మీరే నిర్ణయించండి... వెనకాలే నడుస్తాం: సోనియాకు లాలూ హామీ

త్వరలో రాష్ట్రపతి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీజేపీకి పోటీగా విపక్షాల తరఫున ఎవరిని నిలపాలన్న అంశంపై సోనియాగాంధీ తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటానని రాష్ట్రీయ జనతాదళ్ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ స్పష్టం చేశారు. విపక్షాల తరుపున ఆమె ఎవరి పేరును సూచించినా, మరో మాట మాట్లాడకుండా మద్దతిస్తామని అన్నారు.

"మేడమ్... మీరు నిర్ణయం తీసుకోండి. మీ వెనకాలే నడుస్తాం" అని తనకు ఫోన్ చేసిన సోనియా గాంధీతో లాలూ వ్యాఖ్యానించినట్టు ఆర్జేడీ వర్గాలు వెల్లడించాయి. ఇదే సమయంలో ఆగస్టులో విపక్ష పార్టీలు తలపెట్టిన మెగా ర్యాలీకి తాను హాజరు కాబోనని, తన ఆరోగ్య పరిస్థితి ఢిల్లీని దాటి వెళ్లనివ్వడం లేదని సోనియా వ్యాఖ్యానించినట్టు తెలుస్తోంది. కాగా, రాష్ట్రపతి ఎన్నికలు జూలైలో జరగనున్న సంగతి తెలిసిందే.

More Telugu News