: పార్టీలో మొదటి నుంచి ఉన్న కార్యకర్తలకు బీజేపీ బైక్ ల కానుక!

భారతీయ జనతా పార్టీలో మొదటి నుంచి ఉన్న కార్యకర్తలకు శుభవార్త. ఆ కార్యకర్తలకు ఉచితంగా బైక్ లు అందజేయాలని బీజేపీ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ నుంచి 120 బైక్ లను తెలంగాణ బీజేపీ కార్యాలయానికి పంపింది. తెలంగాణలోని అన్ని నియోజకవర్గాలకు బైక్ లను పార్టీ పంపనున్నట్టు సమాచారం. కాగా, ఈ విషయమై బీజేపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఈ బైక్ లను ‘లక్కీ బైక్’లుగా వారు అభివర్ణిస్తున్నారు.

More Telugu News