: పార్టీ సేవల కోసం అర్హుల‌ను ఎంపిక చేస్తాం: ప‌వ‌న్ క‌ల్యాణ్‌

ఈ రోజు శ్రీ‌కాకుళంలో జ‌న‌సేన‌ పార్టీ కోసం ఎంపిక‌లు జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే. ఈ సంద‌ర్భంగా ప‌వ‌న్ క‌ల్యాణ్ ఓ ప్రకటన విడుదల చేస్తూ... ఈ ఎంపిక‌ల్లో యువ‌త ఉత్స‌హంగా పాల్గొంటున్నార‌ని, పార్టీ సేవల కోసం అర్హుల‌ను ఎంపిక చేస్తామ‌ని అన్నారు. త‌మ‌కు అందిన అన్ని ద‌ర‌ఖాస్తుల‌ను క్షుణ్ణంగా ప‌రిశీలిస్తున్నామ‌ని చెప్పారు. విజ‌య న‌గ‌రం నుంచి జ‌న‌సేన‌కు వ‌చ్చిన ద‌రఖాస్తుల వివ‌రాల‌ను ప‌వ‌న్ వెల్ల‌డిస్తూ.. మొత్తం 2 వేల ద‌ర‌ఖాస్తులు వ‌చ్చాయ‌ని అన్నారు. ఈ నెల 20, 21న విజ‌యన‌గ‌రంలోనూ జ‌న‌సేన శిబిరం ఉంటుంద‌ని తెలిపారు. కాగా, శ్రీకాకుళం, విశాఖపట్నం, గ్రేటర్ హైదరాబాద్ లలో జనసేన శిబిరాల గురించి పవన్ కల్యాణ్ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.  


<blockquote class="twitter-tweet" data-lang="en"><p lang="te" dir="ltr">విజయనగరం లో ఈ నెల 20, 21 న జనసేన శిబిరం.<br><br>Complete list : <a href="https://t.co/47DoPxcLS4">https://t.co/47DoPxcLS4</a> <a href="https://t.co/PLRJuZPyga">pic.twitter.com/PLRJuZPyga</a></p>— JanaSena Party (@JanaSenaParty) <a href="https://twitter.com/JanaSenaParty/status/864784336272240642">May 17, 2017</a></blockquote>
<script async src="//platform.twitter.com/widgets.js" charset="utf-8"></script>

More Telugu News