: నేను చెప్పాల్సింది చెప్పేశా: రజనీకాంత్

రాజకీయాల్లోకి రావాలనే కోరిక తనకు లేదని, ఒకవేళ దేవుడు ఆదేశిస్తే రాజకీయాల్లోకి వచ్చి అవినీతికి తావులేని స్వచ్ఛమైన పాలన అందిస్తానని తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. అయినప్పటికీ, రజనీకాంత్ రాజకీయాల్లోకి రావాలని అభిమానులు గట్టిగా కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో రజనీ కాంత్ మరోమారు స్పందిస్తూ, తాను చెప్పాల్సింది చెప్పేశానని, ఇంకా చెప్పడానికి ఏమీ లేదని అన్నారు. కాగా, చెన్నై కోడంబాక్కంలోని రాఘవేంద్ర కల్యాణ మండపంలో ఐదు రోజుల పాటు జిల్లాల వారీగా అభిమానులను కలుస్తున్నారు.

More Telugu News