: తమిళనాట కలకలం... మంత్రి విజయభాస్కర్ ఇళ్లపై ఐటీ దాడులు

తమిళనాడులో ఆర్కే నగర్ నియోజకవర్గంలో ఓటర్లకు డబ్బులు పంచాడన్న ఆరోపణలను ఎదుర్కొన్న మంత్రి విజయభాస్కర్ పై ఆదాయపు పన్ను అధికారులు మరోసారి కొరడా ఝళిపించారు. ఇలుప్పుర, పుకొట్టాయ్ ప్రాంతాల్లోని ఆయన నివాసాల్లో ఈ ఉదయం దాడులు చేశారు. ఆర్కే నగర్ లో దినకరన్ కు ఓట్లు వేయాలని కోరుతూ, విజయభాస్కర్ డబ్బులు పంచారన్నదానికి సాక్ష్యాలను సేకరించిన అధికారులు గతంలోనూ ఓ సారి ఆయన ఇంట్లో దాడులు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి ఆయనతో పాటు ఆయన అనుచరులైన మాజీ ఎంపీ రాజేంద్రన్, వైస్‌ చాన్స్‌లర్‌ గీతాలక్ష్మి ఇళ్లపైనా దాడులు చేస్తున్నారు. తాజా ఐటీ దాడులతో తమిళనాడు రాజకీయ నేతల్లో కలవరం మొదలైంది.

More Telugu News