: పాలస్తీనాకు మద్దతు విషయంలో దృఢంగా ఉన్నాం: ప్రధాని మోదీ

పాలస్తీనాకు మద్దతు విషయంలో దృఢంగా ఉన్నామని భారత ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. వీసా మినహాయింపులు, ఆరోగ్యం, క్రీడలు సహా రెండు దేశాల మధ్య ఐదు ఒప్పందాలపై భారత్, పాలస్తీనా దేశాలు సంతకాలు చేశాయి. ఈ సందర్భంగా ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో మన ప్రధాని మోదీ, పాలస్తీనా అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్ పాల్గొన్నారు. అనంతరం మోదీ మాట్లాడుతూ, శాంతి కోసం పాలస్తీనా అనుసరిస్తున్న విధానానికి భారత్ పూర్తి మద్దతు ఇస్తుందని, పాలస్తీనా, ఇజ్రాయెల్ దేశాల మధ్య చర్చల ప్రక్రియ కొనసాగాలని ఆశిస్తున్నానని అన్నారు.

More Telugu News