: హైదరాబాద్ లో వడ్డీ వ్యాపారి దాష్టీకం.. అప్పు తీసుకున్న వ్యక్తి భార్యను కిడ్నాప్ చేసిన వైనం

హైదరాబాద్‌లోని అంబర్‌పేట్‌లో ఓ వడ్డీ వ్యాపారి చేసిన‌ దాష్టీకం బ‌య‌ట‌ప‌డింది. వాచ్ మెన్ గా పనిచేసే శ్రీ‌నివాస్ అనే వ్య‌క్తి తన వద్ద అప్పు తీసుకుని, తిరిగి చెల్లించ‌క‌పోవ‌డంతో అత‌డి భార్య‌ను ఆ వ‌డ్డీ వ్యాపారి కిడ్నాప్ చేశాడు. ఈ ఘ‌ట‌న‌పై శ్రీ‌నివాస్ అంబర్‌పేట పోలీస్ స్టేష‌న్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు స‌ద‌రు వడ్డీ వ్యాపారి కోసం రెండు బృందాలతో గాలింపు ప్రారంభించారు. వ‌డ్డీ వ్యాపారి పేరు కూడా శ్రీ‌నివాస్ అని తెలుస్తోంది. అత‌డి వ‌ద్ద బాధితుడు గ‌తంలో రూ.4 ల‌క్షలు అప్పుగా తీసుకున్నాడు.         

More Telugu News