: నన్ను టచ్ చేసేంత దమ్ము బీజేపీకి లేదు: లాలూ ఫైర్

ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో తనకు సంబంధించిన, తనకు సన్నిహితులైన వ్యక్తులకు చెందిన 22 స్ధావరాలపై ఐటీ శాఖ అధికారులు దాడులు జరపడంపై ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ మండిపడ్డారు. ఇలాంటి వాటికి భయపడేంత పిరికివాడిని కాదని ఆయన అన్నారు. తన గొంతు నొక్కేంత దమ్ము, ధైర్యం బీజేపీకి లేవని ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఐటీ శాఖ దాడులు జరిపిన 22 స్థావరాలకు సంబంధించిన వివరాలను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. వెయ్యి కోట్ల విలువైన బినామీ ఆస్తులు, పన్ను ఎగవేతల ఆరోపణల నేపథ్యంలో ఐటీ శాఖ ఈ సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే.

More Telugu News