: వైఎస్సార్సీపీ సభ్యుల తీరు విచిత్రంగా ఉంది: సీఎం చంద్రబాబు

వైఎస్సార్సీపీ సభ్యుల తీరు విచిత్రంగా ఉందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు విమర్శించారు. టీడీఎల్పీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఆ పార్టీ సభ్యులకు విజ్ఞత, ఆలోచన లేవని, ఏ అంశానికి సహకరించాలో ఎప్పుడు వ్యతిరేకించాలో ప్రతిపక్షానికి తెలియడం లేదన్నారు. జీఎస్టీ బిల్లుపై చర్చను విపక్షం అడ్డుకుందని, మిర్చి రైతులను ఆదుకునేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని, మిర్చి క్వింటాకు రూ.1500 బోనస్ ఇస్తున్నామని, ప్రతిపక్షానికి ఇవేవీ కన్పించడం లేదని అన్నారు.

ఈ సందర్భంగా రాష్ట్రంలోని సంక్షేమ పథకాల గురించి ఆయన ప్రస్తావించారు. ఈ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో మంత్రులు, ఎమ్మెల్యేలు విఫలమవుతున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పద్ధతి మార్చుకోవాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యేలను హెచ్చరించారు. చాలా మంది ఇంకా మూస పద్ధతిలోనే ఆలోచిస్తున్నారని, కొత్త పథకాలను మంత్రులు అధ్యయనం చేయడం లేదని అన్నారు. ఈ విషయమై మంత్రులు, ఎమ్మెల్యేలు వినూత్నంగా ఆలోచించాలని చంద్రబాబు సూచించారు. 

More Telugu News