: వైఎస్ రాజశేఖర్ రెడ్డికి, చంద్రబాబుకు తేడా అదే!: ఘట్టమనేని ఆదిశేషగిరిరావు

వైఎస్ రాజశేఖర్ రెడ్డికి తనను నమ్మినవాళ్లను ఆదుకోవడం అలవాటని సీనియర్ నటుడు ఘట్టమనేని కృష్ణ సోదరుడు, ప్రముఖ నిర్మాత ఆదిశేషగిరిరావు అన్నారు. ఓ న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ఏ విషయంలోనైనా వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముక్కుసూటిగా వెళతారని అన్నారు. అదే, చంద్రబాబు నాయుడు వ్యూహకర్త అని, కొంచెం ముందుచూపుతో వ్యవహరిస్తారని అన్నారు. తనను నమ్మినవాళ్లను నష్టపరిచి అయినా సరే, అనుకున్నది సాధించడమనేది ఆయనకు కావాలని అన్నారు. అందుకు నిదర్శనం.. గతంలో చంద్రబాబు సీఎం కావడానికి కారకులైన దగ్గుబాటి వెంకటేశ్వరరావు, నందమూరి హరికృష్ణ... వంటి వాళ్లను దూరంగా పెట్టడమేనని అన్నారు. అడ్డమైన హామీలిచ్చి చంద్రబాబు అధికారంలోకి వచ్చారని ఆదిశేషగిరిరావు విమర్శించారు.

More Telugu News