: లష్కరే తోయిబా ఉగ్రవాదులు ఇద్దరు హతం

జమ్మూకాశ్మీర్ లోని హంద్వారా ప్రాంతంలో ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా బలగాలు హతమార్చాయి. హంద్వారాలోని వారిపొరలో ఉగ్రవాదులు తలదాచుకున్న సమాచారం మేరకు భద్రతా బలగాలు విస్తృతంగా తనిఖీలు చేపట్టాయి. ఈ క్రమంలో భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య కాల్పులు జరిగాయి. దీంతో, ఉగ్రవాదుల కాల్పులను భారత బలగాలు తిప్పికొట్టాయి. ‘లష్కరే’కు చెందిన ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయని, ఇరువైపులా కాల్పులు కొనసాగుతున్నాయని సీనియర్ ఆర్మీ అధికారి ఒకరు వెల్లడించారు.

More Telugu News