: ఐపీఎల్-10: లయన్స్ పై సన్ రైజర్స్ విజయం.. ప్లే ఆఫ్లో హైదరాబాద్ బెర్త్ ఖరారు
ఐపీఎల్-10 సీజన్ తుది ఘట్టానికి చేరుకుంది. ఈ రోజు జరిగిన మ్యాచులో గుజరాత్ లయన్స్ తో హైదరాబాద్ సన్ రైజర్స్ తలపడింది. గుజరాత్ టీమ్ని 8 వికెట్ల తేడాతో ఓడించిన సన్ రైజర్స్ ప్లే ఆఫ్లో బెర్త్కు అవసరమైన విజయాన్ని అందుకుంది. హైదరాబాద్ టీమ్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ మరో బ్యాట్స్మెన్ విజయ్ శంకర్ ధాటిగా ఆడడంతో గుజరాత్ లయన్స్ ఇచ్చిన 155 పరుగుల లక్ష్యాన్ని హైదరాబాద్ ఈజీగా చేరుకుంది. 11 బంతులు మిగిలి ఉండగానే హైదరాబాద్ విజయాన్ని అందుకుంది. గుజరాత్ లయన్స్లో డ్వేన్ స్మిత్, కిషన్ అర్ధ సెంచరీలు చేసి అలరించారు. అయితే, మిగతా ఏ బ్యాట్స్మెన్ చెప్పుకోతగ్గ స్కోరు చేయలేదు. విజయం సాధించిన సన్ రైజర్స్ టీమ్ 17 పాయింట్లతో పట్టికలో రెండో స్థానానికి ఎగబాకింది.