: మైసూరు ప్యాలెస్ లో అగ్నిప్రమాదం

ప్రఖ్యాతిగాంచిన మైసూరు ప్యాలెస్ లో అగ్ని ప్రమాదం సంభవించింది. ప్యాలెస్ ను సందర్శించేందుకు పర్యాటకులు వెళ్లే వరాహ ప్రవేశ ద్వారం వద్ద ఈ ప్రమాదం నిన్న ఉదయం సంభవించింది. అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడకు చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదానికి కరెంట్ షార్ట్ సర్క్యూట్ కావడమే కారణమని అధికారులు భావిస్తున్నారు. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించడంతో... పెద్దగా నష్టం వాటిల్లలేదు.

More Telugu News