: లండన్ కోర్టులో విజయ్ మాల్యా విచారణ వాయిదా

భారత బ్యాంకులకు వేల కోట్ల రూపాయల అప్పులు ఎగ్గొట్టి బ్రిటన్ పారిపోయిన లిక్కర్ బ్యారన్ విజయ్ మాల్యా కేసు చిన్న మలుపు తిరిగింది. మాల్యాను భారత్ కు అప్పగించే విషయమై లండన్ లోని వెస్ట్ మినిస్టర్ కోర్టు ముందుకు రావలసిన విచారణ వాయిదా పడింది. ఇది జూన్ 13కు వాయిదా పడిందని బ్రిటన్ క్రౌన్ ప్రాసిక్యూషన్ సర్వీస్ తెలిపింది. మన దేశం తరపున కోర్టులో వాదనలు వినిపించనున్నది క్రౌన్ ప్రాసిక్యూషన్ సంస్థనే. వాస్తవానికి ఈ కేసు విచారణ మే 17న చేపట్టాల్సి ఉంది.

More Telugu News