: రాఖీ సావంత్ కు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసిన న్యాయస్థానం

ప్రముఖ బాలీవుడ్ నటి రాఖీ సావంత్ కు లుధియానా న్యాయస్థానం నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. రామాయణాన్ని రాసిన వాల్మీకిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తూ...వాల్మీకి కులస్తులను కించపరిచారని, దీంతో తమ మనోభావాలు దెబ్బతిన్నాయని లుధియానాకు చెందిన నరిందర్ అదియా అనే న్యాయవాది స్థానిక కోర్టులో ఫిర్యాదు చేయడంతో మార్చి 9న అరెస్టు వారెంట్ జారీ చేసిన సంగతి తెలిసిందే.

దీంతో కోర్టు ఆదేశం మేరకు ఇద్దరు పోలీసు అధికారులు రాఖీ సావంత్ ను అరెస్టు చేసేందుకు ముంబై వెళ్లగా, కోర్టు పేర్కొన్న చిరునామాలో ఆమె దొరకలేదు. దీంతో పోలీసులు వెనుదిరిగారు. ఈ నేపథ్యంలో ఆమెపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసిన న్యాయస్థానం, ఈ కేసు విచారణను జూన్ 2వ తేదీకి వాయిదా వేసింది.  

More Telugu News