: దారుణానికి పాల్పడ్డ పాస్టర్ కు జీవిత ఖైదు!

పదమూడేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డ ఓ చర్చి పాస్టర్ కు జీవితఖైదు విధిస్తూ కేరళలోని త్రిస్సూర్ ప్రత్యేక సెషన్స్ కోర్టు తీర్పు నిచ్చింది. ఆ బాలికపై మూడేళ్ల పాటు అత్యాచారానికి పాల్పడ్డ ఆ పాస్టర్ ను ఆయన చనిపోయేంత వరకు జైల్లోనే ఉంచాలని సెషన్స్ జడ్జి నిక్సన్ జోసఫ్ ఆదేశించారు.

ఈ కేసు పూర్వాపరాల విషయానికొస్తే..  కేరళలోని త్రిస్సూర్ సాల్వేషన్ ఆర్మీ చర్చిలో సానిల్ కె జేమ్స్ పాస్టర్ గా పనిచేస్తున్నాడు. 2013 నుంచి 2015 వరకు ఓ దళిత బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. సదరు బాలిక ఈ విషయాన్ని తన ఉపాధ్యాయురాలికి చెప్పడంతో పాస్టర్ వ్యవహారం బయటపడింది. ఒకే పాఠశాలలో చదువుతున్న ఇద్దరు బాలికలపై సదరు పాస్టర్ అత్యాచారం చేసినట్టు రుజువైంది. ఈ కేసును విచారించిన న్యాయస్థానం పవిత్రమైన వృత్తిలో ఉంటూ పాస్టర్ దారుణానికి పాల్పడ్డారంటూ కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

More Telugu News