: జగన్ పార్టీకి రాజశేఖర్ రెడ్డి ఫొటో పెట్టుకునే అర్హత లేదు: రఘువీరా రెడ్డి

వైఎస్సార్సీపీపైన, ఆ పార్టీ అధినేత జగన్ పైన ఏపీ కాంగ్రెస్ నేత రఘువీరా రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఏపీకి ప్రత్యేకహోదాపై పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, జగన్ పార్టీకి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఫొటో కానీ, కాంగ్రెస్ పేరు కానీ పెట్టుకునే అర్హత లేదన్నారు. బీజేపీతో జగన్ కలిసిపోయారని, టీడీపీ, వైఎస్సార్సీపీ రాష్ట్రాన్ని తాకట్టుపెట్టాయని ఆరోపించారు.

More Telugu News