: శంషాబాద్ ఎయిర్ పోర్టులో లంచం తీసుకుంటూ సీబీఐకి చిక్కిన అధికారులు

హైదరాబాద్ లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో సీబీఐ సోదాలు నిర్వహించింది. నాలుగు వేలు లంచం తీసుకుంటూ పీక్యూఐఎస్ అసిస్టెంట్ డైరెక్టర్ అతుల్ శ్రీకృష్ణ ఠాక్రే, అసిస్టెంట్ ప్లాన్ ప్రొటెక్షన్ ఆఫీసర్ మనోజ్ సీబీఐ చేతికి చిక్కారు. టీ కప్పులు ఎగుమతికి సంబంధించి క్లియరెన్స్ సర్టిఫికెట్ కోసం వారు లంచం డిమాండ్ చేశారన్న ఆరోపణలు రావడంతో సీబీఐ సోదాలు నిర్వహించింది.

More Telugu News