: ఢిల్లీకి చేరుకున్న చంద్రబాబు

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అమెరికా పర్యటన ముగిసింది. కాసేపటి క్రితం ఆయన అమెరికా నుంచి ఢిల్లీకి చేరుకున్నారు. చంద్రబాబు అమెరికా పర్యటన ఏడు రోజులపాటు కొనసాగింది. పర్యటన సందర్భంగా ఆయన 15 నగరాల్లో పర్యటించారు. వివిధ కంపెనీలకు చెందిన 90 మంది అధినేతలు, సీఈవోలను ఆయన కలుసుకున్నారు. 30కి పైగా సమావేశాలను నిర్వహించారు. తన పర్యటన వల్ల ఏపీకి 12,500 ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందని చెప్పారు. ఐటీ, హార్డ్ వేర్, విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, ఇంటర్నెట్ రంగాల్లోకి పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని ట్విట్టర్ ద్వారా చంద్రబాబు తెలిపారు. 

More Telugu News