: అమరావతి సిద్ధమైతే ఇక చెన్నై సంగతి అంతే.. చంద్రబాబును ప్రశంసల్లో ముంచెత్తిన కేంద్రమంత్రి రాధాకృష్ణన్

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం పూర్తయితే దాని ముందు చెన్నై దిగదుడుపే అవుతుందని తమిళనాడుకు చెందిన బీజేపీ సీనియర్ నేత, కేంద్రమంత్రి పొన్ రాధాకృష్ణన్ వ్యాఖ్యానించారు. అమరావతి పేరుతో ఏపీలో అత్యాధునిక సాంకేతికతతో సరికొత్త నగరం రూపుదిద్దుకుంటోందన్నారు. ప్రపంచంలోని ప్రముఖ పరిశ్రమలు, విద్యాసంస్థలు అమరావతికి తరలిపోతాయని, దీంతో అభివృద్ధిలో చెన్నై వెనకబడిపోతుందన్నారు. ప్రజలకు ఏం కావాలో ముఖ్యమంత్రి చంద్రబాబుకు తెలుసని పేర్కొన్న మంత్రి, ఆయన రేయింబవళ్లు కష్టపడుతున్నారని ప్రశంసించారు. పారిశ్రామికవేత్తలతో మాట్లాడి రాష్ట్రానికి రప్పించుకుంటున్నారని తెలిపారు. కానీ తమిళ సీఎంను కలవాలంటే పారిశ్రామికవేత్తలు నెలలపాటు వేచి చూడాల్సి వస్తోందని విమర్శించారు.

More Telugu News