: పార్లమెంటులో అల్లూరి విగ్రహంపై... విజయసాయిరెడ్డి లేఖలకు లోక్ సభ కార్యదర్శి జవాబు

 తెలుగు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని పార్లమెంట్ ఆవరణలో ఏర్పాటు చేయాలని వైఎస్సార్సీపీ ఎంపీ (రాజ్యసభ సభ్యుడు) విజయసాయిరెడ్డి కొంత కాలంగా కోరుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పార్లమెంట్ కమిటీకి పలుసార్లు ఆయన లేఖలు రాశారు. ఈ లేఖలపై లోక్ సభ కార్యదర్శి మునీష్ కుమార్ స్పందించారు. పార్లమెంట్ ప్రాంగణంలో విగ్రహాల ఏర్పాటుపై త్వరలో జాయింట్ కమిటీ సమావేశం జరగనున్న విషయాన్ని విజయసాయిరెడ్డికి ఆయన తెలిపారు.

More Telugu News