: కూంబింగ్ దళాల కంటపడిన మావోలు... పంఖాజుర్ ప్రాంతంలో సాగుతున్న భీకర ఎన్ కౌంటర్

చత్తీస్ గఢ్ పరిధిలోని పంఖాజుర్ అడవుల్లో కూంబింగ్ నిర్వహిస్తున్న బీఎస్ఎఫ్ దళాలకు మావోయిస్టులు కనిపించడంతో వారి మధ్య భారీ ఎన్ కౌంటర్ జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఈ ఉదయం గాలింపు చర్యల్లో భాగంగా, అడవిలోకి వెళ్లిన జవాన్లు తమకు తారసపడిన మావోలను లొంగిపోవాలని హెచ్చరించగా, వారు కాల్పులకు దిగడంతో ఈ ఎన్ కౌంటర్ ప్రారంభమైనట్టు తెలుస్తోంది.

కాగా, గత నెల 24న సీఆర్పీఎఫ్ జవాన్లపై దాడి చేసి 25 మందిని పొట్టనబెట్టుకున్న మావోలను తుదముట్టించడమే లక్ష్యంగా అడవుల్లో భారీ ఎత్తున కూంబింగ్ మొదలైన సంగతి తెలిసిందే. ఇందుకోసం 'సమాధాన్' పేరిట సరికొత్త వ్యూహాత్మక కార్యాచరణను హోం మంత్రి రాజ్ నాథ్ ప్రకటించగా, జవాన్లు ఇప్పుడు దాన్నే అమలు చేస్తున్నారు.

More Telugu News