: బీబర్ కోసం ఢిల్లీ నుంచి విమానమెక్కేసి ముంబై చేరిన 12 ఏళ్ల చిన్నారి

ముంబైలోని డీవై పాటిల్‌ స్టేడియంలో పాప్‌ సింగర్ జస్టిన్‌ బీబర్‌ ప్రదర్శనను చూసేందుకు పన్నెండేళ్ల చిన్నారి విమానమెక్కి ఢిల్లీ నుంచి ముంబైకి వచ్చేసిన ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఢిల్లీకి చెందిన అక్షితా రాజ్‌ పాల్‌ అనే 12 ఏళ్ల బాలిక అమిటీ ఇంటర్నేషనల్‌ స్కూల్‌ లో 8వ తరగతి చదువుతోంది. బీబర్‌ కు అక్షిత వీరాభిమాని, దీంతో ఢిల్లీలోని లజ్ పత్ నగర్ లో ఫ్యాషన్ రిటైల్ షాప్ నిర్వహించే తండ్రి అజయ్ రాజ్ పాల్, ప్రైవేటు సంస్థలో పని చేసే తల్లితో కలిసి చూసేందుకు మూడు ప్లాటినం టికెట్లు కొనుగోలు చేసింది.

చివరి నిమిషంలో ఆమె తల్లిదండ్రులు ఈ షోను చూసేందుకు రాలేమని చెప్పడంతో ఏమాత్రం ఆలోచించని అక్షిత, తన ఫ్యామిలీ ఫ్రెండ్స్ కు ఆ రెండు టికెట్లు ఇచ్చేసి, ఢిల్లీ నుంచి ముంబైకి వచ్చేసింది. చదువులోనే కాకుండా సంగీతం, మార్షల్‌ ఆర్ట్స్, మోడలింగ్, నటనలో చురుగ్గా ఉండే అక్షిత బాలీవుడ్‌ సినిమా ‘ఫిలౌరీ’ లో చిన్న పాత్ర పోషించింది. ఎస్బీఐ జనరల్‌ ఇన్సూరెన్స్, కొడక్, బిర్లా సన్‌ లైఫ్స్, ఫోర్టిస్ వంటి కంపెనీల ప్రకటనల్లోనూ కనిపించింది. 

More Telugu News