: కాసేపట్లో ప్రారంభం కానున్న నిషిత్ నారాయణ అంతిమ యాత్ర... చేరుకున్న టీడీపీ ప్రముఖులు

నిషిత్ నారాయణ అంత్యక్రియలు కాసేపట్లో ప్రారంభం కానున్నాయి. నెల్లూరులోని పెన్నా నది ఒడ్డున ఆయన అంత్యక్రియలు జరుగుతాయి. ఈ మేరకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. కాగా, కుమారుడి దుర్మరణంతో విషాదంలో మునిగిపోయిన మంత్రి నారాయణను ఓదార్చేందుకు పార్టీలకతీతంగా నెల్లూరు నేతలు చేరుకున్నారు. మంత్రి వర్గ సహచరుడు విషాదంలో ఉండడంతో మంత్రి వర్గ సభ్యులు కూడా నెల్లూరు చేరుకున్నారు. అలాగే పలువురు టీడీపీ నేతలు, ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు కూడా నెల్లూరు వచ్చారు. నారా లోకేష్ తో పాటు ఇతరులు కూడా అంతిమయాత్రలో పాల్గొననున్నట్టు తెలుస్తోంది. 

More Telugu News