: రాష్ట్రపతి అభ్యర్థిగా గాంధీ మనవడు గోపాలకృష్ణ గాంధీ?

రాష్ట్రపతి అభ్యర్థి ఎవరన్న దానిపై ఇప్పటి వరకు అటు ఎన్డీఏ కానీ, ఇటు యూపీఏ కానీ ఓ నిర్ణయానికి రాలేకపోతున్నాయి. ఇప్పటికే ప్రముఖుల పేర్లు తెరపైకి వచ్చినా కాసేపటికే మాయం అవుతున్నాయి. తాజాగా మహాత్మాగాంధీ మనవడు, గతంలో దౌత్యవేత్తగా, గవర్నర్‌గా సేవలందించిన గోపాలకృష్ణ గాంధీ పేరు తెరపైకి వచ్చింది. రాష్ట్రపతి అభ్యర్థిగా ఆయనను దింపాలని యోచిస్తున్న ప్రతిపక్ష నేతలు గోపాలకృష్ణ‌తో చర్చలు కూడా జరిపినట్టు తెలుస్తోంది.

రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేయాలని ఆయనను కోరినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయంలో ఇంతకుమించి పురోగతి లేదని, చర్చలు ప్రాథమిక దశలోనే ఉన్నాయని ప్రతిపక్ష నేతలు చెబుతున్నారు. ఊహాగానాలు వద్దని సూచించారు. కాగా, గోపాలకృష్ణ గాంధీ ఆసక్తి చూపకుంటే లోక్‌సభ మాజీ స్పీకర్ మీరా కుమార్‌‌ ను బరిలోకి దింపాలని కాంగ్రెస్ యోచిస్తున్నట్టు తెలుస్తోంది. పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ కూడా గాంధీవైపే మొగ్గుచూపుతున్నట్టు సమాచారం.  
 

More Telugu News