: ప్రధాని మోదీతో భేటీ అయిన జగన్.. కొనసాగుతున్న సమావేశం

ప్రధాని నరేంద్ర మోదీతో వైసీపీ అధినేత జగన్ భేటీ అయ్యారు. కాసేపటి క్రితం ఢిల్లీ చేరుకున్న ఆయన... నేరుగా మోదీ నివాసానికి వెళ్లి ఆయనతో సమావేశమయ్యారు. గత కొంతకాలంగా ప్రధాని అపాయింట్ మెంట్ కోసం వేచి చూస్తున్న జగన్ కు అపాయింట్ మెంట్ ఖరారయినట్టు ప్రధాని కార్యాలయం నుంచి సమాచారం రావడంతో... ఉన్నపళంగా ఆయన ఢిల్లీ వెళ్లారు. ఆయన వెంట ఎంపీలు విజయసాయి రెడ్డి, మేకపాటి రాజమోహన్ రెడ్డి తదితరులు ఉన్నారు.

ప్రస్తుతం మోదీతో వీరి సమావేశం కొనసాగుతోంది. ఈ సందర్భంగా రాష్ట్రానికి చెందిన పలు సమస్యలను మోదీ దృష్టికి జగన్ తీసుకువెళ్లనున్నారు. ముఖ్యంగా రైతు సమస్యలు, ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని హామీల అమలు, పోలవరం ప్రాజెక్టుకు నిధులు తదితర అంశాలపై ప్రధానితో చర్చించనున్నారు. సమస్యలన్నింటికీ తక్షణమే పరిష్కారం చూపాలంటూ విన్నవించనున్నారు. 

More Telugu News