: అతివేగమే నిషిత్ ప్రాణాలు తీసింది... మద్యం ఆనవాళ్లు లభించలేదు: ఫోరెన్సిక్ వైద్యులు

హైదరాబాదులోని జూబ్లిహిల్స్, రోడ్ నెంబర్ 36లో మెట్రో పిల్లర్ ను బెంజ్ కారు ఢీ కొట్టిన ఘటనలో మృతి చెందిన నిషిత్ నారాయణ, రాజారవివర్మ మృతదేహాలకు అపోలో ఆసుపత్రిలో ఉస్మానియా వైద్యులు పోస్టు మార్టం పూర్తి చేశారు. ఈ సందర్భంగా వారు పలు అంశాలను వెల్లడించారు. నిషిత్ నారాయణ, రవివర్మ ప్రయాణించిన కారు వేగం వల్లనే ప్రమాదం జరిగి మృతి చెందారని తెలిపారు. మద్యం తాగినట్టు ఆనవాళ్లు లేవని వారు తేల్చారు. ఈ ప్రమాదంలో నిషిత్ ఛాతి, పక్కటెముకలు విరిగాయని వారు తెలిపారు. నిషిత్ డ్రైవింగ్ చేస్తున్నాడని, బలంగా పిల్లర్ ను కారు తాకడంతోనే వారు  మృతి చెందారని తేల్చారు. రవివర్మ కంటే నిషిత్ కే ఎక్కవ దెబ్బలు తగిలాయని వారు తెలిపారు.

More Telugu News