: అపోలో ఆసుపత్రికి వెళ్లిన మంత్రి హరీష్ రావు, నామా నాగేశ్వరరావు... సంఘటనా స్థలిని పరిశీలించిన బొండా ఉమ

హైదరాబాదులోని జూబ్లిహిల్స్, రోడ్ నెంబర్ 36లో మెట్రో పిల్లర్ ను ఢీ కొట్టిన ఘటనలో మృతి చెందిన నిషిత్ నారాయణ, రాజారవివర్మ మృతదేహాలకు పంచనామా, ఇతర ఫార్మాలిటీస్ అపోలో ఆసుపత్రిలో పూర్తి చేస్తున్నారు. ఈ సందర్భంగా నిషిత్ నారాయణ మృతి చెందాడని తెలియడంతో తెలంగాణ మంత్రి హరీష్ రావు, నామా నాగేశ్వరరావు అపోలో ఆసుపత్రికి చేరుకుని నారాయణ కుటుంబ సభ్యులను ఓదార్చుతున్నారు. టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమ ప్రమాదం జరిగిన సంఘటనాస్థలిని పరిశీలించారు. అనంతరం అపోలోకు చేరుకున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం కూడా అపోలోలో నిషిత్ నారాయణ మృతదేహాన్ని జూబ్లిహిల్స్ లోని నారాయణ నివాసానికి చేర్చే ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

More Telugu News