: ‘బాహుబలి-2’ను ఆలస్యంగా చూశా.. క్షమించండి: హీరో నాగ చైతన్య

వెయ్యి కోట్లకు పైగా కలెక్షన్లతో దూసుకుపోతున్న ‘బాహుబలి-2’ చిత్రానికి సినీ, రాజకీయ, ఇతర రంగాలకు చెందిన ప్రముఖుల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే టాలీవుడ్ లో అగ్ర హీరోల నుంచి ప్రముఖ నటుల వరకు తమ అభినందనలు తెలిపారు. అయితే, హీరో అక్కినేని నాగ చైతన్య మాత్రం ఇప్పుడు స్పందించారు. ఇదే విషయాన్ని చైతూ ప్రస్తావిస్తూ, ‘ఈ వేడుకలో పాలు పంచుకునేందుకు ఆలస్యమైనందుకు క్షమించండి, బాహుబలి-2’ చిత్రాన్ని ఇప్పుడే చూశాను, శాల్యూట్’ అని పోస్ట్ చేశాడు. కాగా, కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రారండోయ్ వేడుక చూద్దాం’ చిత్రంలో నాగ చైతన్య సరసన రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తోంది.

More Telugu News