: బీఎస్ఎఫ్ తనిఖీలు.. పది కిలోల మందుపాతర నిర్వీర్యం

ఛత్తీస్ గఢ్ లో పదికిలోల మందుపాతరను బీఎస్ఎఫ్ జవాన్లు నిర్వీర్యం చేశారు. కాంకేర్ జిల్లాలోని బద్గావ్-ముర్వాండీ రహదారిలో తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో పది కిలోల మందుపాతరను గుర్తించారు. కాగా, సుక్మా జిల్లాలో మావోయిస్టులపై విరుచుకుపడేందుకు కోబ్రా కమాండోలు సిద్ధమవుతున్నారు. సుక్మాతో పాటు సమీప ప్రాంతాల్లోని మావోయిస్టులను ఎదుర్కొనేందుకు సుమారు రెండు వేల మంది కోబ్రాలు రంగంలోకి దిగనున్నారు.

More Telugu News