: సీఎం కేసీఆర్ పై కర్ణాటక మహిళా ఎంపీ విమర్శలు!

తెలంగాణ సీఎం కేసీఆర్ పై కర్ణాటక మహిళా ఎంపీ శోభా కరండ్లజె విమర్శలు గుప్పించారు. నాగర్ కర్నూల్ నియోజకవర్గంలో నిర్వహించిన బీజేపీ పార్లమెంటరీ బూత్ కమిటీ సదస్సులో నాగం జనార్దన్ రెడ్డితో పాటు ఆమె కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా శోభా కరండ్లజె మాట్లాడుతూ, దేశం కోసం ప్రధాని నరేంద్ర మోదీ పనిచేస్తున్నారని, సీఎం కేసీఆర్ మాత్రం తన కుటుంబాన్ని చక్కబెట్టుకునేందుకు పనిచేస్తున్నారని, తెలంగాణ అభివృద్ధికి కేసీఆర్ అడ్డుపడుతున్నారని ఆరోపించారు. గ్రామాల అభివృద్ధికి 14వ ఫైనాన్స్ కింద కేంద్రం నిధులు ఇస్తే విద్యుత్ బకాయిల కింద రాష్ట్ర ఖజానా నింపుకున్నారని అన్నారు.

More Telugu News