: నాడు సునీల్ కు బ్రేక్ ఇచ్చిన రాజమౌళి మదిలో నేడు సుబ్బరాజు... టాలీవుడ్ లో చర్చ!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రాజమౌళి నిర్మించిన భారీ చిత్రం 'మగధీర' అప్పట్లో రికార్డు కలెక్షన్లను వసూలు చేసి హయ్యస్ట్ గ్రాసర్ గా నిలిచిన సంగతి గుర్తుండే ఉందికదా? ఆ సినిమాలో కామెడీని పండించిన సునీల్ ను తన తరువాతి చిత్రం 'మర్యాద రామన్న' ద్వారా హీరోగా మార్చివేశాడు రాజమౌళి. మర్యాద రామన్న తరువాత సునీల్ హీరోగా మారిపోయాడు. ఇప్పుడు 'బాహుబలి-2' కూడా వసూళ్ల సునామీని సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో టాలీవుడ్ లో చక్కర్లు కొడుతున్న పుకారు ఏంటంటే, ఈ సినిమాలో కామెడీ పండించిన సుబ్బరాజును హీరోగా పెట్టి రాజమౌళి ఓ చిన్న చిత్రాన్ని నిర్మించనున్నారని. మగధీర ఫార్ములానే రాజమౌళి ఫాలో కానున్నారన్న వార్తను, ప్రస్తుతానికి ఓ జోక్ అని అనుకున్నా, ఈ సినిమా పట్టాలెక్కే అవకాశాలు కూడా ఉన్నాయన్నది కొందరి వాదన.

More Telugu News