: 'బాహుబలి-3'పై స్పందించిన రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్

'బాహుబలి-2' ఘన విజయం తర్వాత మూడో భాగం కూడా వస్తుందేమోనని కొందరు సినీ అభిమానులు భావిస్తున్నారు. అయితే 'బాహుబలితో' తన పని పూర్తయిపోయిందని దర్శకదిగ్గజం రాజమౌళి ఇప్పటికే ప్రకటించాడు. ఇప్పుడు రాజమౌళి తండ్రి, ఈ సినిమా కథా రచయిత విజయేంద్రప్రసాద్ కూడా దీనిపై పూర్తి క్లారిటీ ఇచ్చారు.

"బాహుబలిని మేము ఇప్పటికే పూర్తి చేశాం. మూడవ భాగం ఉండదు. నేను కానీ, నా కుమారుడు రాజమౌళి కానీ దీనికి సంబంధించి ఏమీ అనుకోలేదు. మూడో భాగానికి సంబంధించి నేను కూడా కథను రాయడం లేదు" అంటూ డీఎన్ఏ పత్రికతో మాట్లాడుతూ తెలిపారు. అయితే బాహుబలి మూలం నుంచి కామిక్ సిరీస్, టీవీ సిరీస్ లు వస్తాయని తెలిపారు. అవే సెట్స్ మీద వీటి షూటింగ్ జరుగుతుందని... అందువల్ల బాహుబలికి ముగింపు లేదని చెప్పారు.

More Telugu News