: ఓల్డ్ సిటీ మినీ పాకిస్థాన్...అది భారత్ కాదు: రాజా సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు

హైదరాబాదులోని ఓల్డ్ సిటీ భారత్ లో భాగం కాదని... మినీ పాకిస్థాన్ అని బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ టీవీ చానెల్ తో ఇంటర్వ్యూ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశంలో ఎక్కడ టెర్రరిస్టు దొరికినా అతని మూలాలు హైదరాబాదులోని ఓల్డ్ సిటీలో ఉంటాయని అన్నారు. కింద్ ఎంఐఎం ఆఫీసు ఉంటుంది, దానిపైన టెర్రరిస్టులు నివాసం ఉంటారని ఆయన చెప్పారు.

దేశంలో టెర్రరిజం నడవడానికి కారణం... ఓల్డ్ సిటీలో రాజకీయం చేసే రెండు పార్టీలేనని ఆయన చెప్పారు. ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులకు పాత బస్తీలో ఆశ్రయం ఇస్తున్నారని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. వందేమాతరం, భారత్ మాతాకీ జై అనని వారి మెడపై కత్తిపెట్టి వారితో ఆ నినాదాలు పలికిస్తామని ఆయన చెప్పారు. అలాగే ప్రైవేటు సైన్యాన్ని తయారు చేయాలని ఆయన పిలుపునిచ్చారు. తనపై వెయ్యి కేసులు వేసినా, ఉరి శిక్ష వేసినా భయపడేది లేదని ఆయన చెప్పారు. ఆ విధంగానైనా దేశం కోసం చావాలన్న కొరిక తీరుతుందని ఆయన తెలిపారు. 

More Telugu News