: 'బాహుబలి-2' మేనియాలోనూ దూసుకెళుతున్న 'పవర్ పాండ్'!

ప్రపంచవ్యాప్తంగా 'బాహుబలి: ది కన్ క్లూజన్' దూసుకెళుతున్న రోజులివి. ఈ సినిమాకు పోటీగా మరో చిత్రాన్ని విడుదల చేసే సాహసాన్ని కూడా ఎవరూ చేయలేకపోతున్నారు. అయితే, బాహుబలి కన్నా రెండు వారాల ముందు తమిళంలో ధనుష్ స్వయంగా దర్శకత్వం వహించి నిర్మించిన 'పవర్ పాండ్' చిత్రం మాత్రం కలెక్షన్లలో దూసుకెళుతోంది. ఏప్రిల్ 14న ఈ చిత్రం విడుదల కాగా, బాహుబలి థియేటర్లను తాకిన తరువాత కూడా ధనుష్ పవర్ చూపుతున్నాడు. ఈ చిత్రం వసూళ్లు ఇప్పటికీ నిలకడగా సాగుతూ ఉన్నాయి. ఇక 'పవర్ పాండ్'కు సీక్వెల్ తీయాలని, అందులో రజనీకాంత్ కు ఓ పాత్ర ఇవ్వాలని ధనుష్ భావిస్తున్నాడట.

More Telugu News