: వచ్చే ఎన్నికల్లో పార్టీ టికెట్ ఇవ్వకపోతే.. పార్టీ కోసం పని చేస్తా: దేవినేని అవినాష్

వచ్చే ఎన్నికల్లో టీడీపీ తరపున టికెట్టు రాకపోతే, పార్టీ కోసం పని చేస్తానని దేవినేని అవినాష్ అన్నారు. ఓ న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, పార్టీ కోసమే పనిచేస్తానని, చంద్రబాబు, లోకేశ్ కోసమే పని చేస్తానని చెప్పారు. తాము టీడీపీలో చేరేటప్పుడు ఎటువంటి ఒడంబడికలు చేసుకోలేదని, పార్టీ కోసం పని చేస్తామని, పదవులు అడిగే మనస్తత్వం తమది కాదని చెప్పారు. తెలుగు విద్యార్థి సంఘంలోయునైటెడ్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ (యూఎస్ఓ) ను కలిపేందుకు తాను సిద్ధమని ఓ ప్రశ్నకు సమాధానంగా అవినాష్  చెప్పారు.

More Telugu News