: టీడీపీ నేత సీఎం రమేష్ నా పై దాడి చేశారు: లైన్ మ్యాన్ ఆరోపణ

టీడీపీ నేత సీఎం రమేష్ మరో వివాదంలో చిక్కుకున్నారు. తనపై సీఎం రమేష్ దాడి చేశాడంటూ కడప జిల్లా పొట్టదుర్తిలో విద్యుత్ లైన్ మ్యాన్ విజయకుమార్ పై ఆయన దాడి చేసినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. విద్యుత్ లైన్ మరమ్మతుల్లో భాగంగా విజయ్ కుమార్ కొన్ని చెట్లను నరికారు. ఈ విషయం తెలుసుకున్న సీఎం రమేష్ అక్కడికి చేరుకుని, తమకు చెందిన చెట్లను ‘మీరు ఎలా నరుకుతారు?’ అంటూ అసభ్యంగా మాట్లాడుతూ, ఆయన తనపై చేయి చేసుకున్నారని విజయ్ కుమార్ ఆరోపించారు. ఈ విషయమై తన అధికారులకు ఫిర్యాదు చేశానని బాధితుడు పేర్కొన్నారు. కాగా, గాయాలపాలైన విజయ్ కుమార్ ను చికిత్స నిమిత్తం ప్రొద్దుటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. 

More Telugu News