: కేజ్రీవాల్ పై కావాలనే బురద జల్లుతున్నారు: కుమార్ విశ్వాస్

ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత కేజ్రీవాల్ పై  నిన్నటివరకు విరుచుకుపడ్డ ఆ పార్టీ నేత కుమార్ విశ్వాస్ ఇప్పుడు ప్లేటు మార్చారు. కేజ్రీవాల్ పై వచ్చిన లంచం ఆరోపణలను తాను ఖండిస్తున్నానని, ఆయన అటువంటి వ్యక్తి కాదని అన్నారు. కేజ్రీవాల్ కు శత్రువు కూడా ఈ ఆరోపణలు నమ్మరంటూ ఆయనకు మద్దతుగా నిలిచారు. కేజ్రీవాల్ లంచం తీసుకుంటారనే విషయాన్ని తాను ఊహించుకోలేకపోతున్నానని, కపిల్ మిశ్రా చేసిన వ్యాఖ్యలు అర్థరహితమైనవని అన్నారు.

More Telugu News