: నిన్న కిరణ్ బేడీపై విరుచుకుపడ్డ నగ్మా... నేడు రజనీకాంత్ తో భేటీ!

నిన్న పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌ కిరణ్‌బేడీపై తీవ్రస్థాయిలో మండిపడి వార్తల్లో నిలిచిన ఆలిండియా మహిళా కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి, సినీనటి నగ్మా, ఈ ఉదయం సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ ను కలిశారు. తన 'బాషా' హీరోను ఆమె శాలువా, పుష్పగుచ్చంతో సత్కరించారు. వీరిద్దరూ ఏం మాట్లాడుకున్నారన్న విషయమై సమాచారం వెల్లడి కాలేదు. మర్యాదపూర్వకంగానే రజనీకాంత్‌ ను నగ్మా కలిసినట్టు రజనీ సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. రాజకీయాల్లోకి రజనీ రావాలన్న డిమాండ్ కు రోజురోజుకూ మద్దతు పెరుగుతున్న వేళ, వీరిద్దరి భేటీ చర్చనీయాంశంగా మారింది.

More Telugu News