: కేజ్రీవాల్ రూ. 2 కోట్ల లంచం తీసుకోవడం నేను చూశాను: కపిల్ మిశ్రా వేసిన బాంబిదే!

అరవింద్ కేజ్రీవాల్ తొలగించిన మంత్రి కపిల్ మిశ్రా ముందుగా చెప్పినట్టుగానే, ఓ బాంబులాంటి వార్తను పేల్చారు. మంచినీటి ట్యాంకర్ల యజమానుల నుంచి రూ. 2 కోట్లను వసూలు చేసిన సత్యేంద్ర జైన్, తన కళ్ల ముందే ఆ డబ్బును అరవింద్ కేజ్రీవాల్ కు ఇచ్చారని సంచలన ఆరోపణలు చేశారు. తాను ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన వాడినని, పార్టీ మారతానని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని అన్నారు. ఈ మధ్యాహ్నం రాజ్ ఘాట్ కు వచ్చి, మహాత్మునికి నివాళులు అర్పించిన ఆయన అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ లంచానికి తానే సాక్షినని, ఎటువంటి విచారణ జరిగినా సాక్ష్యమిచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని అన్నారు. ఆప్ పార్టీ వ్యవస్థాపక సభ్యుల్లో ఉన్న తాను పార్టీని వదిలివేస్తానని ఎందుకు అనుకుంటారని, పార్టీలో అవినీతి మకిలి అంటిన నేతలే తనను బలి చేశారని ఆరోపించారు.

More Telugu News