: పాక్ కీలక నిర్ణయం... ముంబై - కరాచీ విమానాల రద్దు

ముంబై - కరాచీల మధ్య తిరిగే అన్ని విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్టు పాకిస్థాన్ కీలక ప్రకటన చేసింది. ఈ నిషేధం రేపటి నుంచి అమల్లోకి వస్తుందని, ముందుగా టికెట్లు బుక్ చేసుకున్న వారికి ఆ డబ్బును వెనక్కు చెల్లిస్తామని పేర్కొంది. ఈ మేరకు పీఐఏ (పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్) ఓ ప్రకటన చేసింది. కాగా, భారత ఎయిర్ లైన్స్ సంస్థలు కరాచీ, ఇస్లామాబాద్ ప్రాంతాలకు నడిపే అంతర్జాతీయ సర్వీసులు మాత్రం కొనసాగనున్నాయి. ప్రస్తుతం న్యూఢిల్లీ, జైపూర్, ముంబై, అమృతసర్ విమానాశ్రయాల నుంచి పాక్ కు సర్వీసులు నడుస్తున్న సంగతి తెలిసిందే.

More Telugu News