: సినీ దర్శకుడు కోదండరామిరెడ్డి ఇంట్లో యువతి ఆత్మహత్య

సీనియర్ దర్శకుడు కోదండ రామిరెడ్డి ఇంట్లో పనిచేస్తున్న తూర్పు గోదావరి జిల్లా కట్టమూరు గ్రామానికి చెందిన యువతి జయశ్రీ (19) ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల ప్రకారం, గత సంవత్సరం నుంచి ఆమె హైదరాబాదులోని కోదండరామిరెడ్డి ఇంటి ఆవరణలోనే ఓ గదిలో ఉంటూ పని చేస్తోంది. గత నెలలో స్వగ్రామానికి వెళ్లిన ఆ యువతి, తిరిగి వచ్చేటప్పుడు తన తల్లి నాగమణిని కూడా తీసుకొచ్చింది. వారిద్దరూ పని చేసుకుంటూ ఉన్నారు. తల్లి బయటకు వెళ్లి వచ్చే సరికి కుమార్తె ఉరి వేసుకుని మరణించింది. విషయం తెలుసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. తప్పనిసరి పరిస్థితుల్లో అయినా, తన తల్లితో పని చేయించడం ఇష్టం లేక ఆమె ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా తేల్చారు. కేసును లోతుగా దర్యాఫ్తు చేస్తున్నామని తెలిపారు.

More Telugu News