: కొడనాడు 'అమ్మ' బంగ్లా రహస్యమేంటో తేల్చేందుకు కదులుతున్న పోలీసులు

నీలగిరి జిల్లా కొడనాడులో దివంతగ జయలలిత ఎస్టేట్ భవంతిలో సాగుతున్న పరిణామాలు క్రైమ్ థ్రిల్లర్ సినిమాను తలపిస్తున్న నేపథ్యంలో, ఇక్కడి మిస్టరీని తేల్చి, చిక్కుముడులను విప్పేందుకు కోయంబత్తూరు, నీలగిరి, సేలం పోలీసులు నడుం బిగించారు. ఇక్కడ జరిగిన హత్యలు, దోపిడీలపై తాము అదుపులోకి తీసుకున్న వారంతా పొంతన లేని విధంగా సమాధానాలు ఇస్తుండటంతో, ఎటూ పాలుపోని స్థితిలో ఉన్న పోలీసులు, ఈ భవనంలో ఏముంది? విలువైన వస్తువులు ఏంటి? నగదు ఉందా? ఇత్యాది విషయాలను పరప్పన అగ్రహార జైల్లో ఉన్న శశికళకు తెలిసే అవకాశాలు ఉన్నాయని భావిస్తూ, ఆమెను విచారించాలని నిర్ణయించారు.

ఆపై శశికళ దగ్గరి బంధువు టీటీవీ దినకరన్ కు కూడా కొన్ని విషయాలు తెలిసుండవచ్చని, వారిని విచారిస్తే, దోపిడీ, హత్యలకు కారణాలను తెలుసుకోవచ్చని భావిస్తున్నారు. అయితే, ఈ ఇద్దరూ జైల్లో ఉండటంతో వారి విచారణకు తగిన అనుమతుల కోసం కోర్టులను ఆశ్రయించాలని పోలీసు అధికారులు నిర్ణయించినట్టు తెలుస్తోంది.

More Telugu News