: నిర్భ‌య.. నిన్ను ఎప్పటికీ మ‌రువ‌బోము: సుప్రీంతీర్పుపై ప్రియాంక చోప్రా భావోద్వేగపూరిత ట్వీట్

కొన్నేళ్ల క్రితం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన‌ నిర్భ‌య కేసులో న‌లుగురు దోషుల‌కు కింది కోర్టులు వేసిన‌ ఉరిశిక్ష తీర్పును సుప్రీంకోర్టు స‌మ‌ర్థించిన విష‌యం తెలిసిందే. బాలీవుడ్ నుంచి హాలీవుడ్‌లోకి ప్ర‌వేశించిన న‌టి ప్రియాంక చోప్రా సుప్రీంకోర్టు తీర్పుపై భావోద్వేగపూరితంగా స్పందించింది. ‘నిర్భ‌య.. నిన్ను ఎప్పటికీ మ‌రువ‌ము’ అని ట్వీట్ చేసింది. ఈ కేసులో తీర్పుకు ఐదేళ్లు ప‌ట్టినా, చివ‌ర‌కు న్యాయం గెలిచింద‌ని ఆమె త‌న‌ ట్విట్ట‌ర్ ఖాతాలో పేర్కొంది. కింది కోర్టుల తీర్పును స‌మ‌ర్థిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు స‌రైందేన‌ని, అలాంటి నేర‌గాళ్ల‌ను ద‌హించివేయాల‌ని ఆమె పేర్కొంది.

More Telugu News