: నాకు టోపీకి, బొట్టుకు తేడా లేదు: యోగి

తనకు అన్ని మతాలు ఒకటేనని, యూపీలో ఉన్న ప్రతి ఒక్కరికి రక్షణ కల్పించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. తనకు టోపీకి (ముస్లిం), బొట్టుకు (హిందూ) తేడా లేదని స్పష్టం చేశారు. ఓ జాతీయ చానల్ తో మాట్లాడిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తాను స్థాపించిన హిందూ యువవాహిని సంస్థ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతోందన్న నివేదికల గురించి ప్రశ్నించగా... ఆయన తీవ్ర స్థాయిలో స్పందించారు.

 మెడలో కాషాయ కండువాలు వేసుకున్న వారు జాగ్రత్తగా ఉండాలని, లేకపోతే వాళ్లపై కఠిన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. అంతేకాదు, బీజేపీని కాని లేదా దీనికి సంబంధించిన ఏ ఇతర సంస్థ పేరునైనా పాడుచేద్దామని ఎవరైనా ప్రయత్నిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. శాంతిభద్రతలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని... వంద రోజుల పాలన పూర్తయ్యే సమయానికి చిన్న ఘటన కూడా జరగకుండా కంట్రోల్ చేస్తామని తెలిపారు.

More Telugu News