: ఏలూరులో బాలుడి ప్రాణం తీసిన క్రికెట్ ఆట!

ఏలూరులో క్రికెట్ ఆట ఒక కుటుంబంలో చిచ్చురేపింది. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో పదోతరగతి పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురు చూస్తున్న సందీప్ అనే బాలుడు పాతఊరిలోని ఇంటి  ఎదురుగా ఉన్న కమ్యూనిటీ హాల్ క్రికెట్ గ్రౌండ్ కు వెళ్లాడు. అక్కడ క్రికెట్ ఆడుతుండగా...గణేష్ అనే యువకుడు వచ్చి తాను కూడా క్రికెట్ ఆడుతానని, బ్యాటు ఇవ్వాలని డిమాండ్ చేశాడు.

దీనికి సందీప్ నిరాకరించాడు. ఆట మధ్యలో బ్యాటు ఇవ్వనని తేల్చిచెప్పాడు. దీంతో అతనిపై గణేష్ విచక్షణా రహితంగా దాడి చేశాడు. దీంతో సందీప్ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. అనంతరం ఆటోలో ఆసుపత్రికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయింది. అప్పటికే సందీప్ ప్రాణాలు కోల్పోయాడని వైద్యులు తెలిపారు. దీంతో సందీప్ కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. 

More Telugu News